కరోనా మృతదేహం దహనానికి యత్నం..అధికారులను కొట్టిన గ్రామస్థులు

ABN , First Publish Date - 2021-05-17T18:01:16+05:30 IST

కరోనా మృతదేహానికి అంత్యక్రియలు చేస్తుండగా గ్రామస్థులు అడ్డుకొని అధికారులు, పోలీసులను కొట్టిన ఘటన...

కరోనా మృతదేహం దహనానికి యత్నం..అధికారులను కొట్టిన గ్రామస్థులు

 మయూర్‌భంజ్ (ఒడిశా): కరోనా మృతదేహానికి అంత్యక్రియలు చేస్తుండగా గ్రామస్థులు అడ్డుకొని అధికారులు, పోలీసులను కొట్టిన ఘటన ఒడిశా రాష్ట్రంలోని మయూర్‌భంజ్ జిల్లా సోనారిపోసి గ్రామంలో వెలుగుచూసింది. వైద్య పరీక్ష కోసం ఆసుపత్రికి వచ్చిన ఓ వృద్ధుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆసుపత్రిలో మరణించడంతో మృతదేహాన్ని సోనారిపోసి గ్రామంలో ఖననం చేసేందుకు అధికారులు, పోలీసులు తీసుకువచ్చారు. సోనారిపోసి గ్రామస్థులు అడ్డుకొని పోలీసులు, అధికారులపై దాడి చేసి కొట్టారు. దీంతో దాడి చేసిన ఏడుగురు గ్రామస్థులపై కేసు పెట్టి వారిని అరెస్టు చేసి జుడీషియల్ కస్టడీకి పంపించామని పోలీసులు చెప్పారు. 


Updated Date - 2021-05-17T18:01:16+05:30 IST