బీజేపీ ఈసారి ఇంటికే: హరీష్ రావత్

ABN , First Publish Date - 2021-12-17T22:01:20+05:30 IST

ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఉద్వాసన పలకాలని ప్రజలు బలంగా నిర్ణయించుకున్నారని..

బీజేపీ ఈసారి ఇంటికే: హరీష్ రావత్

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఉద్వాసన పలకాలని ప్రజలు బలంగా నిర్ణయించుకున్నారని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర ఎన్నికల ప్రచార సారధి హరీష్ రావత్ తెలిపారు. పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రసంగించిన సభకు పెద్దఎత్తున హాజరైన జనాన్ని చూస్తే ఈసారి బీజేపీని వారు మట్టికరిపించడం ఖాయమని స్పష్టమవుతోందని అన్నారు. ''ఈసారి బీజేపీ 60 సీట్లు దాటుతుంది'' అంటూ బీజేపీ ఇచ్చిన నినాదాన్ని ఆయన తిప్పికొట్టారు. ''60 సీట్లు ఇవ్వడం కాదు, ఈసారి బీజేపీని బహిష్కరించాలని ప్రజలు నిర్ణయం తీసుకున్నారు'' అని రావత్ తెలిపారు. బీజేపీ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 సీట్లకు గాను 57 స్థానాల్లో గెలుపొందింది. ఈసారి 60 సీట్లకు పైగా గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Updated Date - 2021-12-17T22:01:20+05:30 IST