మోదీ బెనారస్ పర్యటనపై అఖిలేశ్ యాదవ్ సెటైర్లు
ABN , First Publish Date - 2021-12-14T01:07:18+05:30 IST
కాశీవిశ్వనాథ్ కారిడార్ ప్రారంభోత్సవం నిమిత్తం రెండు రోజుల వారణాసి పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి
ఎటావా: కాశీవిశ్వనాథ్ కారిడార్ ప్రారంభోత్సవం నిమిత్తం రెండు రోజుల వారణాసి పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీపై సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సెటైర్లు వేశారు. ఉత్తరప్రదేశ్లోని ఎటావాలో విలేకరులతో మాట్లాడిన అఖిలేశ్ యాదవ్.. ప్రజలు తమ చివరి రోజుల్లో వెళ్లేది బెనారసర్ (కాశీ)కేనని, కాబట్టి ఆయన (మోదీ) అక్కడ ఒక్క నెలైనా, రెండు, మూడు నెలలైనా ఉండొచ్చని అన్నారు.
బీజేపీ ప్రతి ఒక్కరితోనూ అబద్ధాలు చెబుతోందని, కానీ భగవంతుడి ముందు అబద్ధాలు చెప్పడం సరికాదని అఖిలేశ్ హితవు పలికారు. బీజేపీ అభివృద్ధి పనులు కనుక నెమ్మదిగా సాగకుంటే ఎటావాలోని క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్కు వేదిక అయి ఉండేదన్నారు. ఎటావాను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని అఖిలేశ్ విమర్శించారు.