వైసీపీకి ప్రజలే బుద్ధి చెప్తారు
ABN , First Publish Date - 2020-06-04T09:58:21+05:30 IST
‘వైసీపీ అరా చకాలు మితి మీరిపోయా యి. పేరూరు డ్యాం వద్ద శి లాఫలకాల ధ్వంసం దుర్మా ర్గం. ఆ పార్టీకి ప్రజలే తగిన ..
చంద్రదండు ప్రకాష్నాయుడు ధ్వజం
అనంతపురం వైద్యం, జూన్3 : ‘వైసీపీ అరా చకాలు మితి మీరిపోయా యి. పేరూరు డ్యాం వద్ద శి లాఫలకాల ధ్వంసం దుర్మా ర్గం. ఆ పార్టీకి ప్రజలే తగిన బుద్ది చెప్తారు’ అని మాంస పు ఉత్పత్తుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ చం ద్రదండు ప్రకా్షనాయుడు మండి పడ్డారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ హయాంలో పేరూరు డ్యాంకు హంద్రీనీవా నీటిని తరలించడానికి నిధులు మంజూరు చేశా రన్నారు. అప్పటి సీ ఎం చంద్రబాబు ఆ పనులకు శంకుస్థాపన చేశారన్నారు.
చేత నైతే ఆ పనులు పూర్తిచేసి నీళ్లు అందించి ప్రజల మన్ననలు పొందాలి కానీ పరి టాల రవీంద్ర, చంద్రబాబు, ఎన్టీఆర్, ఇతర నేతలు ఉన్న శిలాఫలకాలను ధ్వంసం చేయడం స రికాదన్నారు. టీడీపీ కార్యకర్తలను దెబ్బకొట్టేందుకు ఇలాం టి కవ్వింపు చర్యలకు పాల్పడటం తగదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దౌర్జ న్యాలు, దాడులు పెరిగిపోయాయన్నారు. ప్రతిపక్షాలను భయపెట్టడం కోసం ఇలాంటి అరాచకాలు సృష్టిస్తున్నారన్నారు.