కువైత్ కీలక నిర్ణయం.. 65 ఏళ్లుపైబడిన వారందరూ..!
ABN , First Publish Date - 2021-04-22T04:59:54+05:30 IST
కువైత్ కీలక నిర్ణయం.. 65 ఏళ్లుపైబడిన వారందరూ..!
కువైత్ సిటీ: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కువైత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎటువంటి ముందస్తు రిజిస్ట్రేషన్ లేకుండా 65 సంవత్సరాలుపైబడిన వారందరూ నేరుగా టీకా పొందొచ్చని ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. దేశ పౌరులతోపాటు తమ దేశంలో నివాసం ఉంటున్న వారు కూడా దీనికి అర్హులే అని అధికారులు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. కువైట్లో ఇప్పటి వరకు దాదాపు 2.60లక్షల మంది కొవిడ్ బారినపడగా ఇందులో సుమారు 1500 మంది ప్రాణాలు కోల్పోయారు.