కన్యకా పరమేశ్వరి ఆలయంలో మహా కుంభాభిషేకం

ABN , First Publish Date - 2021-02-27T05:04:07+05:30 IST

నగరేశ్వర, మహిషాసుర మర్ధని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయ ఆవరణలో కోయంబత్తూర్‌ వాసవీ తిరుప్పణి కమిటీ సౌజన్యంతో మహాకుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.

కన్యకా పరమేశ్వరి ఆలయంలో మహా కుంభాభిషేకం

పెనుగొండ, ఫిబ్రవరి 26: నగరేశ్వర, మహిషాసుర మర్ధని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయ ఆవరణలో కోయంబత్తూర్‌ వాసవీ తిరుప్పణి కమిటీ సౌజన్యంతో మహాకుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం వేద పండితులు కైలాశ గురుకుల్‌ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకుడు కోట సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో రుత్వికులు గణపతి పూజ, కలశ పూజలు చేశారు. అనంతరం నవచండీ హోమం నిర్వహించారు. కైలాశ గురుకుల్‌ మాట్లాడుతూ అమ్మవారిని దర్శించడం ద్వారా సాత్విక భావం, విజయాలు చేకూరుతాయన్నారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ ఈవో జీఎస్‌ఎస్‌ శ్రీనివాస్‌ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Updated Date - 2021-02-27T05:04:07+05:30 IST