వాసవీ శాంతి ధామ్‌లో ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2021-07-25T05:15:43+05:30 IST

పెనుగొండ వాసవీ శాంతి ధామ్‌ ఆల య ప్రాంగణంలో గురు పౌర్ణిమ మహోత్సవాల్లో భాగంగా శనివారం ప్రత్యేక పూజలు చేశారు.

వాసవీ శాంతి ధామ్‌లో ప్రత్యేక పూజలు
హోమాలు చేస్తున్న పండితులు

పెనుగొండ, జూలై 24 : పెనుగొండ వాసవీ శాంతి ధామ్‌ ఆల య ప్రాంగణంలో  గురు పౌర్ణిమ మహోత్సవాల్లో భాగంగా శనివారం ప్రత్యేక పూజలు చేశారు. క్షేత్రపీఠాధిపతి కృష్ణానందపురి స్వామీజీ పర్యవేక్షణలో  నిర్వహించారు. వాసవీ పీఠం పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామీజీ ప్రప్రథమంగా వాసవి ధామ్‌కు విచ్చేశారు. ధ్వజారోహణ, గణపతి పూజ, పంచామృత అభిషేకం, గురుపూజమహోత్సవాలు, సహస్త్రగళార్చన కార్యక్రమాలు  నిర్వహించారు. ఉత్సవాలను పురస్కరించుకుని పెనుగొండ పంచాయతీకి రూ. 8 లక్షలు విలువ చేసే ట్రాక్టర్‌ అందజేశారు. శ్రీవాసవి ఋషిగోత్ర సువర్ణ మందిర మహాద్వారం ముందు రాతి ఐరావతాలు, ప్రాకారోత్సవ రఽథం ఆవిష్కరించారు. ట్రస్టు అధ్యక్షుడు డాక్టర్‌ పీఎన్‌.గోవిందరాజులు పర్యవేక్షించారు.  

Updated Date - 2021-07-25T05:15:43+05:30 IST