అర్హులకు పింఛన్లు అందేలా చూడండి
ABN , First Publish Date - 2020-02-20T09:11:45+05:30 IST
పింఛన్ల విషయంలో అర్హులకు అన్యాయం జరగడం సరికాదు. వెంటనే అర్హులకు న్యాయం జరిగేలా చూడాలని డీఆర్డీఏ పీడీ నరసింహారెడ్డి అధికారులను ఆదేశించారు.
అనంతపురం కార్పొరేషన్, ఫిబ్రవరి 19 : పింఛన్ల విషయంలో అర్హులకు అన్యాయం జరగడం సరికాదు. వెంటనే అర్హులకు న్యాయం జరిగేలా చూడాలని డీఆర్డీఏ పీడీ నరసింహారెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైన ‘నచ్చినోళ్లకే పింఛన్లు, అర్హులకు కోత...అనర్హులకు మేత’ కథనాలకు డీఆర్డీఏ పీడీ స్పందించారు. బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయానికి వచ్చిన ఆయన సెక్రటరీ చాంబర్లో కూర్చుని పత్రికలో వచ్చిన వాటిపై ఆరా తీశారు. తప్పిదాలు ఎక్కడ జరిగాయో విచారించారు. ఎందుకు పింఛన్ రాలేదో ఆన్లైన్లో పరిశీలించారు. వాటిని పునఃపరిశీలించి అర్హులకు వచ్చే నెల పింఛన్ అందేలా చూడాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ సెక్రటరీ శ్రీనివాసులుతో నగరంలోని పింఛన్లపై జరుగుతున్న రీ వెరిఫకేషన్పై చర్చించారు. ఈ ప్రక్రియలో ఇబ్బంది పడుతున్న సచివాలయ ఉద్యోగులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.