పేదల కష్టాలు తీర్చడం కోసమే పింఛన్లు

ABN , First Publish Date - 2022-08-16T04:59:26+05:30 IST

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిరుపేదల కష్టాలు తీర్చడం కోసం

పేదల కష్టాలు తీర్చడం కోసమే పింఛన్లు
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి

  • టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి 

యాచారం, ఆగస్టు 15 : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిరుపేదల కష్టాలు తీర్చడం కోసం ప్రతినెలా పింఛన్ల రూపంలో రూ.కోటి అందజేస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి చెప్పారు. దేశంలో ఎక్కడాలేని విధంగా పింఛన్లను రూ. 2016 నుంచి రూ.3016 పెంచిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అదేవిధంగా వ్యవసాయ రంగానికి ఉచితంగా విద్యుత్‌ ఇవ్వడంతోపాటు రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు గుర్తుచేశారు. రెండు నెలల్లో ప్రతి పేదకుటుంబానికి సామాజిక పింఛన్లు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. హరితహారం కింద విరివిగా మొక్కలునాటి వాటిని కాపాడాలని కోరారు. సమావేశంలో ఎంపీపీ కొప్పు సుకన్యబాషా, జడ్పీటీసీ చిన్నోళ్లజంగమ్మ, సర్పంచ్‌ సరితాపాండురంగారెడ్డి. ఎంపీటీసీ తాండ్రలక్ష్మమ్మ, ఎంపీడీవో విజయలక్ష్మి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కె.రమే్‌షగౌడ్‌ తదితరులున్నారు. 



Updated Date - 2022-08-16T04:59:26+05:30 IST