కృష్ణాజిల్లా: పింఛన్ అందక వృద్ధ మహిళ మృతి

ABN , First Publish Date - 2020-02-19T20:26:16+05:30 IST

ఉయ్యూరు, (కృష్ణాజిల్లా): పింఛన్ అందక మనోవేదనకు గురై ఉయ్యూరు మండలం జబర్లపూడి గ్రామానికి చెందిన..

కృష్ణాజిల్లా: పింఛన్ అందక వృద్ధ మహిళ మృతి

ఉయ్యూరు, (కృష్ణాజిల్లా): పింఛన్ అందక మనోవేదనకు గురై ఉయ్యూరు మండలం జబర్లపూడి గ్రామానికి చెందిన గుడివాడ సుబ్బలమ్మ  (75) అనే మహిళ మృతి చెందింది. ఆమె భౌతికకాయానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్సీలు వైవీబీ రాజేంద్రప్రసాద్, బచ్చుల అర్జునుడు, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తదితరులు సుబ్బలమ్మ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 75 ఏళ్ల వృద్ధురాలు స్వాతంత్ర్య సమరయోధురాలుగా కారణం చూపి పింఛన్ తొలగించడంపై కళా వెంకట్రావు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామన్నారు. 


Updated Date - 2020-02-19T20:26:16+05:30 IST