ఎన్టీఆర్పై విశ్వాసమే టీడీపీ గెలుపుకు పునాది
ABN , First Publish Date - 2022-08-08T05:58:01+05:30 IST
ఆనాడు ఎన్టీఆర్పై ప్రజలకు ఉన్న అచంచల విశ్వాసమే టీడీపీ గెలుపుకు కారణమైందని రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు చెప్పారు.
తెనాలి అర్బన్, ఆగస్టు 7 : ఆనాడు ఎన్టీఆర్పై ప్రజలకు ఉన్న అచంచల విశ్వాసమే టీడీపీ గెలుపుకు కారణమైందని రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు చెప్పారు. పెన్షనర్స్ అసోసియేషన్ హాల్లో ఎన్టీఆర్ శత జయంతి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా మాణిక్యరావుతో పాటు మృదంగ విధ్వంసుడు నగధరరావు, జాగర్లమూడి టీడీపీ అధ్యక్షుడు లింగం సాయికృష్ణలను సన్మానించారు. ఈ సందర్బంగా మాణిక్యరావు మాట్లాడుతూ, తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి సాటి చెప్పిన వారిలో తొలి వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. ఆమహావ్యక్తికి ఏడాది పాటు శత జయంతి ఉత్సవాలు నిర్వహించే భారాన్ని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ భుజస్కందాలపై వేసుకోవడం మహోజ్వల ఘట్టంగా మిగిలిపోతుందన్నారు. దేవరపల్లి భవాని, కొండమూది రమేష్, శరత్, మల్లవరపు విజయ్, శ్యామ్, బి.రమేష్, నలుకుర్తి రమేష్ తదితరులు పాల్గొన్నారు.