పెన్షన్‌ వర్తింపజేయాలి: ఎన్‌ఎంయూ

ABN , First Publish Date - 2021-09-17T06:43:41+05:30 IST

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసారని ఐతే పదవీ విరమణ చేసిన కార్మికులకు పెన్సన్‌ విధానాన్ని వర్తింప చేయాలంటూ ఎన్‌ఎంయూ రాష్ట్ర,జోనల్‌ కార్యదర్శులు ముద్దుపాటి లక్ష్మీనారాయణ చెన్నారెడ్డి డిమాండ్‌ చేశారు.

పెన్షన్‌ వర్తింపజేయాలి: ఎన్‌ఎంయూ

పుట్టపర్తి, సెప్టెంబరు 16: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసారని ఐతే పదవీ విరమణ చేసిన కార్మికులకు పెన్సన్‌ విధానాన్ని వర్తింప చేయాలంటూ ఎన్‌ఎంయూ రాష్ట్ర,జోనల్‌ కార్యదర్శులు ముద్దుపాటి లక్ష్మీనారాయణ చెన్నారెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక బస్సు డిపో సర్వసభ్మ సమావేశం నిర్వహించారు. ఉద్యోగ భద్రతతో పాటు విశ్రాంత ఉద్యో గులకు పెన్షన్‌ వర్తింపచేయాలంటూ డిమాండ్‌ చేశారు. అనంతరం పలు సమస్యలపై చర్చిం చారు. సమావేశంలో జోనల్‌ సభ్ములు శంకరయ్య శ్రీరాంనాయక్‌ భారతి, సాయిలీల రీజినల్‌ చైర్మన్‌ ముత్యాలప్ప అధ్యక్షుడు పుల్లయ్య కార్యదర్వి షబ్బీర్‌, సదాశివరెడ్డి శంకరయ్య చండ్రాయిడుతో పాటు పలువురు యూనియన్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-17T06:43:41+05:30 IST