కోత విధించిన పింఛను బకాయిలు చెల్లించాలి
ABN , First Publish Date - 2020-08-13T07:45:03+05:30 IST
కోత విధించిన పింఛను బకాయిలను వెంటనే చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వ పింఛనుదారుల జేఏసీ డిమాండ్ చేసింది. ఐకాస చైర్మన్
- తెలంగాణ పింఛనుదారుల జేఏసీ డిమాండ్
కోత విధించిన పింఛను బకాయిలను వెంటనే చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వ పింఛనుదారుల జేఏసీ డిమాండ్ చేసింది. ఐకాస చైర్మన్ కె.లక్ష్మయ్య అధ్యక్షతన కోర్ కమిటీ సమావేశం బుధవారం జరిగింది. దీనికి ఐకాస ప్రతినిధులు ఎం.సూర్యనారాయణ, పాలకుర్తి కృష్ణమూర్తి, ఎ.రాజేంద్ర బాబు, సుభాకర్రావు, జ్ఙానేశ్వర్లు హాజరై.. పింఛనుదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. అంతంత మాత్రంగానే ఉండే పింఛనుతో బతుకులీడుస్తున్న తమను వేతన కోత అనేది మరింత ఇబ్బందుల్లోకి నెట్టిందని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించాలని కోరింది.