పబ్లిక్‌ ఇష్యూకు పెన్నా సిమెంట్స్‌

ABN , First Publish Date - 2021-05-15T05:57:45+05:30 IST

పబ్లిక్‌ ఇష్యూ ద్వారా హైదరాబాద్‌కు చెందిన పెన్నా సిమెంట్‌ ఇండస్ట్రీస్‌ నిధులు సమీకరించనుంది. కొత్త షేర్లను జారీ చేయడంతో పాటు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా దాదాపు రూ.1,550 కోట్ల సమీకరణకు సెబీ వద్ద

పబ్లిక్‌ ఇష్యూకు పెన్నా సిమెంట్స్‌

రూ.1,550 కోట్ల సమీకరణకు యోచన


హైదరాబాద్‌  (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): పబ్లిక్‌ ఇష్యూ ద్వారా హైదరాబాద్‌కు చెందిన పెన్నా సిమెంట్‌ ఇండస్ట్రీస్‌ నిధులు సమీకరించనుంది. కొత్త షేర్లను జారీ చేయడంతో పాటు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా దాదాపు రూ.1,550 కోట్ల  సమీకరణకు సెబీ వద్ద కంపెనీ పత్రాలు దాఖలు చేసింది. 1991లో పీ ప్రతాప్‌ రెడ్డి దీన్ని స్థాపించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్రలో కంపెనీకి నాలుగు సిమెంట్‌ యూనిట్లు, రెండు గ్రైండింగ్‌ యూనిట్లు ఉన్నాయి. ఏడాదికి దాదాపు కోటి టన్నుల సిమెంట్‌ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరును ప్రీమియంతో జారీ చేయాలని కంపెనీ భావిస్తోంది. పబ్లిక్‌ ఇష్యూలో రూ.1,300 కోట్లకు కొత్త షేర్లను జారీ చేయనుంది. ప్రమోటర్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా షేర్లను విక్రయించి రూ.250 కోట్లను సమీకరించనున్నారు. 

Updated Date - 2021-05-15T05:57:45+05:30 IST