వచ్చే నెలలో పెన్నా బ్యారేజీ ప్రారంభం
ABN , First Publish Date - 2021-07-24T07:27:18+05:30 IST
నెల్లూరులో పెన్నా బ్యారేజీ నిర్మాణాన్ని పూర్తి చేసి వచ్చే నెలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు.
మంత్రి అనిల్
నెల్లూరు, జూలై 23 (ఆంధ్రజ్యోతి) : నెల్లూరులో పెన్నా బ్యారేజీ నిర్మాణాన్ని పూర్తి చేసి వచ్చే నెలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. ఆయన శుక్రవారం బ్యారేజీ నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల వివరాలను ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ బ్యారేజీ నిర్మాణం చివరి దశలో ఉందని, చిన్న చిన్న పనులు చేయాల్సి ఉందని చెప్పారు. కొవిడ్ నేపథ్యంలో పనుల్లో జాప్యం జరిగిందన్నారు. ఈ నిర్మాణం పూర్తయితే తాగు, సాగు నీటి ఇబ్బందులు తీరుతాయని మంత్రి చెప్పారు.