ఏపీ ఎన్‌ఆర్‌టీ సొసైటీ కోఆర్డినేటరుగా పెండ్లిమర్రి వాసి

ABN , First Publish Date - 2021-01-16T05:22:08+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రవాసాంధ్రుల కోసం ఏర్పాటు చేసిన ఏపీ నాన్‌ రెసిడెంట్‌ (ఏపీఎన్‌ఆర్‌టీ) సొసైటీ అమెరికా కోఆర్డినేటరుగా పెండ్లిమర్రి మండలానికి చెందిన ప్రముఖ ప్రవాసాంధ్రుడు జగన్‌మోహన్‌రెడ్డి నియమితులయ్యారు.

ఏపీ ఎన్‌ఆర్‌టీ సొసైటీ కోఆర్డినేటరుగా పెండ్లిమర్రి వాసి

పెండ్లిమర్రి, జనవరి 15: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రవాసాంధ్రుల కోసం ఏర్పాటు చేసిన ఏపీ నాన్‌ రెసిడెంట్‌ (ఏపీఎన్‌ఆర్‌టీ) సొసైటీ అమెరికా కోఆర్డినేటరుగా పెండ్లిమర్రి మండలానికి చెందిన ప్రముఖ ప్రవాసాంధ్రుడు జగన్‌మోహన్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా అమెరికా నుం చి ఆన్‌లైన్‌లో ఆయన మాట్లాడుతూ రైతు కుటుంబం నుంచి అమెరికా వచ్చి తనకు జన్మనిచ్చిన ఆంధ్రప్రదేశ్‌లో అలాగే అమెరికాలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు చేరువయ్యానన్నారు. ఈ విషయాన్ని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి గుర్తించి ఈ ప్రతిష్టాత్మక పదవిలో నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-01-16T05:22:08+05:30 IST