జడ్పీ సీఈవోగా పెండ్లిమర్రి ఎంపీడీవో
ABN , First Publish Date - 2021-05-12T05:11:59+05:30 IST
జిల్లా ప్రజాపరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో)గా పెండ్లిమర్రి ఎంపీడీవో మన్నూరు సుధాకర్రెడ్డిని నియమిస్తూ పంచాయతీరాజ్శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు.
నేడో రేపో బాధ్యతల స్వీకరణ
కడప(రూరల్), మే 11: జిల్లా ప్రజాపరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో)గా పెండ్లిమర్రి ఎంపీడీవో మన్నూరు సుధాకర్రెడ్డిని నియమిస్తూ పంచాయతీరాజ్శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన నేడో రేపో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇదివరకు సీఈవోగా పనిచేసిన సి.సుధాకర్రెడ్డి ఏప్రిల్లో పదవీ విరమణ పొందారు. ఆయన స్ధానంలో జిల్లా సహకారశాఖ ఆడిట్ అధికారిగా పనిచేస్తున్న శ్రీనివాసులరెడ్డి జడ్పీ ఎఫ్ఏసీ సీఈవోగా కలెక్టర్ ఉత్వర్వుల మేరకు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మన్నూరు సుధాకర్రెడ్డిని జడ్పీ సీఈవోగా నియమిస్తూ పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.