పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలి: మల్లాడి

ABN , First Publish Date - 2022-05-24T06:43:02+05:30 IST

యానాం నియోజవర్గంలో వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలి పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్‌.రంగసామిని ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు కోరారు.

పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలి: మల్లాడి

యానాం, మే 23: యానాం నియోజవర్గంలో వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలి పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్‌.రంగసామిని ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు కోరారు. ఈమేరకు సోమవారం సీఎంను కలిసి సమస్యలు వివరించారు. సమస్యలపై మంగళవారం సమావేశం నిర్వహించాలని సీఎంను మల్లాడి కోరారు. ఈమేరకు మంగళవారం ఉదయం  కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాలులో సీఎంతో సమావేశం జరగనుంది. ముఖ్యంగా పలు శాఖల్లో పనిచేస్తోన్న అవుట్‌సోర్సింగ్‌, ఎన్‌ఎంఆర్‌, కాంట్రాక్ట్‌ టీచర్లు తదితర సిబ్బంది జీతాలు పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పిం చాలని తదితర సమస్యలను సమావేశంలో సీఎంకు వివరిస్తానని మల్లాడి పేర్కొన్నారు. ఆయా శాఖలకు చెందిన అధికారులను మల్లాడి కలిశారు. సమావేశంలో పాల్గొనేందుకు యానాం నుంచి మల్లాడి నేతృత్వంలో ప్రత్యేక బస్‌లో 24మంది, మరికొందరు రైలులో పుదుచ్చేరి చేరుకున్నారు.  



Updated Date - 2022-05-24T06:43:02+05:30 IST