పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలి: సీపీ
ABN , First Publish Date - 2021-02-25T05:46:16+05:30 IST
పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలని సీపీ జోయల్ డేవిస్ జిల్లా ఏసీపీ, సీఐలు, ఎస్ఐలకు సూచించారు.
సిద్దిపేట క్రైం, ఫిబ్రవరి 24: పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలని సీపీ జోయల్ డేవిస్ జిల్లా ఏసీపీ, సీఐలు, ఎస్ఐలకు సూచించారు. బుధవారం ఆయన జిల్లా పోలీస్ అధికారులతో పోలీసు కమిషనర్ కార్యాలయంలో పెండింగ్ కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎస్సీ ఎస్టీ, పోక్సో కేసులను రాష్ట్ర కమిషన్లు, జాతీయ కమిషన్లు మానిటర్ చేస్తున్నట్లు చెప్పారు. ప్రతీ ఒక్కరూ కేసుల పరిశోధన పకడ్బందీగా చేయాలని, టెక్నికల్ సాక్ష్యాలు ఉంటే చార్జిషీట్లో పొందుపరచాలని సూచించారు. ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి కాంటాక్ట్, నాన్ కాంటాక్ట్ కేసులను నమోదు చేయాలని సూచించారు. డ్రంకెన్డ్రైవ్ టెస్టులు ప్రతీ రోజూ నిర్వహించాలని తెలిపారు. సిబ్బంది విధి నిర్వహణకు సంబంధించి పలు విషయాలపై అవగాహన కల్పించారు. సమావేశంలో సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్, హుస్నాబాద్ ఏసీపీ మహేందర్, గజ్వేల్ ఏసీపీ నారాయణ, సీఐలు, ఎస్ఐలు ఎస్బీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్కుమార్, కార్యాలయ సూపరింటెండెంట్లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.