పెండింగ్ బిల్లులు చెల్లించాలి
ABN , First Publish Date - 2021-10-19T05:58:34+05:30 IST
ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనుల్లో భాగస్వాములై సొంత డబ్బుతో పనులు చేసి, అప్పులపాలైన తమకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని జిల్లా కాంట్రాక్టర్ల సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
కాంట్రాక్టర్ల డిమాండ్... కలెక్టరేట్లో నిరసన
అనంతపురం క్లాక్టవర్, అక్టోబరు 18
ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనుల్లో భాగస్వాములై సొంత డబ్బుతో పనులు చేసి, అప్పులపాలైన తమకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని జిల్లా కాంట్రాక్టర్ల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఆ మేరకు సోమవా రం వారు కలెక్టరేట్లో నిరసన చేపట్టారు. అనంతరం కలెక్టర్ నాగలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. కాంట్రాక్టర్ల సంఘం ప్రతినిధులు మాట్లాడు తూ చేసిన పనులకు మూడేళ్లుగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయన్నారు. దీంతో పనుల కోసం చేసిన అప్పులు తీర్చలేక, కూలీలకు చెల్లించలేక నా నా అవస్థలు పడుతున్నామన్నారు. కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. ప్రభుత్వం ఇదే నిర్లక్ష్యం కొనసాగిస్తే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు లింగ ప్ప, ఉపాధ్యక్షుడు చిన్న హనుమంతప్ప, నేతలు హనుమంతరెడ్డి, మోహనబాబు, గోవిందు, శ్రీనివాసులు, ఈశ్వర్రెడ్డి, గొల్లరెడ్డి, చంద్రమోహనరెడ్డి, శివశంకర్, కొండయ్య, శీను, రామకృష్ణ పాల్గొన్నారు.