‘కోన’లో వైభవంగా కల్యాణం

ABN , First Publish Date - 2021-07-25T04:01:14+05:30 IST

పెంచలకోన క్షేత్రంలో శనివారం దేవేరులతో శ్రీవారి కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు.

‘కోన’లో వైభవంగా కల్యాణం
కోనలో కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

రాపూరు, జూలై 24: పెంచలకోన క్షేత్రంలో శనివారం దేవేరులతో శ్రీవారి కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఆలయం భక్తులతో కిక్కిరిసింది. పలువురు భక్తులు శుక్రవారం రాత్రే క్షేత్రానికి చేరుకుని నిద్రించి మొక్కలు తీర్చుకున్నారు. తెల్లవారుజామున జరిగే శ్రీవారి అభిషేకంలో పాల్గొని హారతి అందుకున్నారు. భక్తులకు ఉచిత ప్రసాదాలతోపాటు అన్నప్రసాదం అందించినట్లు ఏసీ వెంకటసుబ్బయ్య తెలిపారు. పలు ఆలయాల్లో శనివారం గురుపౌర్ణమి వేడుకలను నిర్వహించారు.

Updated Date - 2021-07-25T04:01:14+05:30 IST