పెన్డౌన్ చేస్తాం: ఉద్యోగ సంఘాలు
ABN , First Publish Date - 2021-09-14T20:13:26+05:30 IST
పంచాయతీ కార్యదర్శిపై వైసీపీ నేత హనుమంతరావు దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వం
గుంటూరు: పంచాయతీ కార్యదర్శిపై వైసీపీ నేత హనుమంతరావు దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వం హనుమంతరావుపై చర్యలు తీసుకోకపోతే పెన్డౌన్ చేస్తామని తెలిపారు. అవసరమైతే ఆమరనిరహరణ దీక్ష కూడా చేస్తామని అసోసియేషన్ నేతలు ప్రసాద్, జాన్ పీరా స్పష్టం చేశారు.
అమరావతి పంచాయతీ కార్యదర్శిపై వైసీపీ నేత దాడి చేసిన సంగతీ తెలీసిందే. పంచాయతీ ఆఫీస్లో పనిచేసే ఇద్దరు ప్రైవేట్ సిబ్బంది తొలగింపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యదర్శి మోహన్చంద్పై వైసీపీ నేత మేకల హనుమంతరావు దాడిచేశారు. కార్యదర్శి మోహన్చంద్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాడికి నిరసనగా పంచాయతీ కార్యాలయం ఎదుట సిబ్బంది ఆందోళనకు దిగారు. వైసీపీ నేత హనుమంతరావును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.