12న పుదుచ్చేరికి మోదీ?

ABN , First Publish Date - 2022-01-04T13:33:04+05:30 IST

ఒకరోజు పర్యటన కోసం ఈ నెల 12వ తేదీ తమిళనాడు రానున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ అదే రోజు పుదుచ్చేరిలోనూ పర్యటించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. 12వ తేదీ ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి

12న పుదుచ్చేరికి మోదీ?

పుదుచ్చేరి: ఒకరోజు పర్యటన కోసం ఈ నెల 12వ తేదీ తమిళనాడు రానున్న  ప్రధానమంత్రి నరేంద్రమోదీ అదే రోజు పుదుచ్చేరిలోనూ పర్యటించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. 12వ తేదీ ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి మదురై రానున్న మోదీ.. అక్కడి నుంచి ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో విరుదునగర్‌ చేరుకుంటారు. అక్కడ జరిగే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం.. తిరిగి మదురై చేరుకుని, అక్కడ బీజేపీ నేతృత్వంలో జరిగే పొంగల్‌ వేడుకలకు హాజరవుతారు. ఆ తరువాత పుదుచ్చేరికి వచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామితో పాటు బీజేపీ నేతల ఆహ్వానం మేరకు ప్రధాని పర్యటించేందకుఉ అంగీకరించినట్లు తెలిసింది. దీంతో అధికారులు పుదువైలోనూ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని ప్రత్యేక భద్రతా సిబ్బంది సైతం పర్యటన ఏర్పాట్లను సమీక్షించినట్లు తెలుస్తోంది. ఆ రోజు సాయంత్రం పుదుచ్చేరిలో మోదీ కార్యక్రమాలు ఉండేలా చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమాలు ముగిసిన అనంతరం మళ్లీ మదురై వెళ్లనున్న ప్రధానితో అక్కడ అన్నాడీఎంకే నేతలు ఎడప్పాడి పళనిస్వామి, ఒ.పన్నీర్‌ సెల్వం భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి కూడా ప్రధానితో ప్రత్యేకంగా సమావేశామవుతారని అధికార వర్గాలు తెలిపాయి.

Updated Date - 2022-01-04T13:33:04+05:30 IST