Pegasus snooping scandal: విచారణ చేపట్టేందుకు సుప్రీం అంగీకారం
ABN , First Publish Date - 2021-07-30T18:07:31+05:30 IST
పెగసస్ వ్యవహారంపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం అంగీకరించింది
జర్నలిస్ట్ రాం పిటిషన్ పై వచ్చేవారం విచారణ
న్యూఢిల్లీ : పెగసస్ వ్యవహారంపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం అంగీకరించింది.పెగసస్ స్నూపింగ్ కుంభకోణంపై సిట్టింగ్ లేదా రిటైర్డు జడ్జితో స్వతంత్ర విచారణ జరిపించాలని సీనియర్ జర్నలిస్ట్ ఎన్ రాం చేసిన పిటిషన్ పై వచ్చే వారం విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం పెగసస్పై దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరిస్తామని ప్రకటించింది.
‘‘ పెగసస్ పై మేం వచ్చే వారంలో ఎప్పుడైనా జాబితా చేస్తాం’’అని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. ఆర్టికల్ 19(1)(ఎ) కింద జర్నలిస్టులు, వైద్యులు, న్యాయవాదులు, పౌరసమాజ కార్యకర్తలు, ప్రభుత్వ మంత్రులు, ప్రతిపక్ష నేతల ఫోన్లను లక్ష్యంగా చేసుకొని హ్యాకింగ్ చేయడంపై పలువురు కోర్టులో పిటిషన్లు వేశారు.నరేంద్రమోదీ అమిత్ షా భారతదేశానికి వ్యతిరేకంగా పెగసస్ ను ఉపయోగించారని రాహుల్ ఆరోపించారు.