పెదపులిపాకను సందర్శించిన కేంద్ర బృందం
ABN , First Publish Date - 2022-08-11T05:59:15+05:30 IST
పెదపులిపాకను సందర్శించిన కేంద్ర బృందం
పెనమలూరు, ఆగస్టు 10 : మండలంలోని పెదపులిపాకను కేంద్రప్రభుత్వ అధికారుల బృందం బుధవారం సందర్శించింది. ప్రభుత్వం ఆదర్శ గ్రామంగా ఎంపిక చేయటంతో గ్రామంలోని ఊర చెరువును సందర్శించిన అధికారుల బృందం మురుగు నీరు బయటికి పంపే ఏర్పాట్లపై చర్చించారు. గ్రామాభివృద్ధికి తగు ప్రణాళికలు తయారు చేయనున్నట్లు తెలిపారు. అధికారుల బృందంలో నాబార్డు ప్రోగ్రాం మేనే జరు లక్ష్మీకాంత్ షిండే, స్వచ్చ కార్పొరేషను నుంచి శివ, గోపాల్, ఆర్డబ్ల్యూఎస్ నుం చి శ్రీనివాసులు, నాంచారయ్య, యూనిసెఫ్ ఇండియా నుంచి అశ్విని అనూష, అభిజిత్, ఎంపీడీవోలు సునీతాశర్మ, విమాదేవి తదితరులు ఉన్నారు.