ధరల పెంపుపై నిరసనగా రాస్తారోకో

ABN , First Publish Date - 2021-02-27T05:27:06+05:30 IST

పెద్దాపురం, ఫిబ్రవరి 26: పెట్రోలు, డీజిలు, గ్యాస్‌ ధరల పెంపునకు నిరసనగా సీఐటీయూ ఆధ్వర్యాన శుక్రవారం పెద్దాపురంలో రాస్తారోకో నిర్వహించారు.

ధరల పెంపుపై నిరసనగా రాస్తారోకో
పెద్దాపురంలో రాస్తారోకో చేస్తున్న సీపీఎం నాయకులు

పెద్దాపురం, ఫిబ్రవరి 26: పెట్రోలు, డీజిలు, గ్యాస్‌ ధరల పెంపునకు నిరసనగా సీఐటీయూ ఆధ్వర్యాన శుక్రవారం పెద్దాపురంలో రాస్తారోకో నిర్వహించారు. పాత బస్టాండ్‌ వద్ద రోడ్డుపై వాహనాలను నిలిపివేశారు. సీఐటీయూ మండలాధక్షుడు గడిగట్ల సత్తిబాబు ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో నాయకులు నీలపాల సూరిబాబు, ఎస్‌.శ్రీనివాస్‌, ముమ్మన ప్రకాష్‌, చందర రాంబాబు, దేవత రాంబాబు, గడిగట్ల అప్పారావు, కూనిరెడ్డి అరుణ దారపురెడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-27T05:27:06+05:30 IST