విద్యా పునాదులపైనే మహిళాభ్యుదయం
ABN , First Publish Date - 2021-03-08T05:15:29+05:30 IST
పెద్దాపురం, మార్చి 7: విద్యా పునాదులపైనే మహిళాభ్యుదయం సాధ్యపడుతుందని డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు అన్నారు. అంతర్జాతీ య మహిళా దినోత్స
డీఎస్పీ శ్రీనివాసరావు
పెద్దాపురం, మార్చి 7: విద్యా పునాదులపైనే మహిళాభ్యుదయం సాధ్యపడుతుందని డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు అన్నారు. అంతర్జాతీ య మహిళా దినోత్సవం సందర్భంగా మండల పరిధిలోని గోరింట గ్రామంలో నవసేన ఆధ్వర్యాన ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడూతూ మహిళలంతా చదువుకుంటే స్వయం సంవృద్ధిని సాధించడంతో పా టు సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. మ హిళలను విద్యాపరంగా మరింత ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. పలువురు మహి ళలను సత్కరించారు. సీఐ జయకుమార్, ఎస్ఐ బాలాజీ, రిలయన్స్ ఫౌండేషన్ పీఎం బర్రే నాగేశ్వరరావు, నవసేనబృంద సభ్యులు పాల్గొన్నారు.