Telangana news: పెద్దపల్లిలో దంపతుల దారుణ హత్య
ABN , First Publish Date - 2022-05-11T17:14:25+05:30 IST
జిల్లాలోని మంథని మండలం పుట్టపాక గ్రామపంచాయతీ పరిధిలోని చల్లపల్లిలో దారుణం జరిగింది.
పెద్దపల్లి: జిల్లాలోని మంథని మండలం పుట్టపాక గ్రామపంచాయతీ పరిధిలోని చల్లపల్లిలో దారుణం జరిగింది. దంపతులను గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు. మృతులు కొత్త సాంబయ్య, లక్ష్మి దంపతులుగా గుర్తించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.