సింగరేణిలో తొలి ఒమైక్రాన్ కేసు నమోదు

ABN , First Publish Date - 2022-01-05T17:22:04+05:30 IST

రాష్ట్రంలో ఒమైక్రాన్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా జిల్లాలోని సింగరేణిలో తొలి ఒమైక్రాన్ కేసు నమోదు అయ్యింది.

సింగరేణిలో తొలి ఒమైక్రాన్ కేసు నమోదు

పెద్దపల్లి: రాష్ట్రంలో ఒమైక్రాన్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా జిల్లాలోని సింగరేణిలో తొలి ఒమైక్రాన్ కేసు నమోదు అయ్యింది. రామగుండం రీజియన్‌లోని 3వ  డివిజన్‌ ఓసిపిటులో కేసు నమోదు అయ్యింది. ఈపీ ఫిట్టర్‌కు ఒమైక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయనను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సింగరేణిలో ఒమైక్రాన్ కేసు నమోదు అవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మిగిలిన కార్మికులకు  వైద్య పరీక్షలు చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒమైక్రాన్ కేసుతో సింగిరేణిలో కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు. 

Updated Date - 2022-01-05T17:22:04+05:30 IST