Peddaplli: లారీని ఢీకొన్న బొలేరో... చిన్నారి మృతి

ABN , First Publish Date - 2022-01-31T18:58:09+05:30 IST

జిల్లాలోని శాంతినగర్ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిదేళ్ల చిన్నారి మృతి చెందింది.

Peddaplli: లారీని ఢీకొన్న బొలేరో... చిన్నారి మృతి

పెద్దపల్లి: జిల్లాలోని శాంతినగర్ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిదేళ్ల చిన్నారి మృతి చెందింది. లారీని బొలేరో వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. శాంతినగర్ వార్డు కౌన్సిలర్ హనుమంతు, సోదరుడు లక్ష్మణ్, ఇద్దరు పిల్లలతో కలిసి మంచిర్యాల నుంచి వస్తున్న క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో తనుశ్రీ (08) అనే చిన్నారిని అక్కడికక్కడే మృతి చెందింది. మరో నలుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-01-31T18:58:09+05:30 IST