రామగుండంలో ఆగని TRS కార్పోరేటర్ల ఆగడాలు
ABN , First Publish Date - 2022-06-14T14:58:32+05:30 IST
జిల్లాలోని రామగుండంలో టీఆర్ఎస్(TRS) కార్పోరేటర్ల ఆగడాలు కొనసాగుతున్నాయి.
పెద్దపల్లి: జిల్లాలోని రామగుండంలో టీఆర్ఎస్(TRS) కార్పోరేటర్ల ఆగడాలు కొనసాగుతున్నాయి. లారీ డ్రైవర్పై మూడో డివిజన్ కార్పోరేటర్ శ్రీనివాస్ బావమరిది సతీష్ దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన లారీ డ్రైవర్ గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సతీష్ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోని పరిస్థితి. మరోవైపు మహిళా కార్పోరేటర్ భర్త గడ్డి కనకయ్య ఇందిరానగర్లో భవాని అనే మహిళ ఇంటిని కూల్చివేశాడు. ఇంటి నిర్మాణం కోసం డబ్బులు ఇవ్వలేదన్న కారణంగా కూల్చివేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ కార్పొరేటర్ల ఆగడాలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.