TS News.. పెద్దపల్లి జిల్లా: మున్సిపల్ కార్పొరేషన్ భేటీని బహిష్కరించిన టిఆర్ఎస్ కార్పొరేటర్లు

ABN , First Publish Date - 2022-08-30T18:39:22+05:30 IST

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశాన్ని అధికార పార్టీ టిఆర్ఎస్ కార్పొరేటర్లు బహిష్కరించారు.

TS News.. పెద్దపల్లి జిల్లా: మున్సిపల్ కార్పొరేషన్ భేటీని బహిష్కరించిన టిఆర్ఎస్ కార్పొరేటర్లు

పెద్దపల్లి జిల్లా (Peddapalli Dist.): రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ (Municipal Corporation) కౌన్సిల్ సమావేశాన్ని అధికార పార్టీ టిఆర్ఎస్ కార్పొరేటర్లు (TRS Corporators) బహిష్కరించారు. రెండు కోట్ల రూపాయల ఎజెండాపై మేయర్‌ను నిలదీశారు. కార్పొరేటర్లు కాంట్రాక్టర్లతో కుమ్మకై 240 ఫైళ్లను అజెండాగా ఎలా పెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ తీరుపై నిరసన తెలిపారు. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్‌ (Minister KTR)కు ఫిర్యాదు చేసేందుకు టీఆర్ఎస్ కార్పొరేటర్లు సిద్దమయ్యారు. పనులు చేయని ఫైళ్లను అజెండాలో పెట్టడంపై కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-08-30T18:39:22+05:30 IST