పేదలకు మెరుగైన వైద్యమే లక్ష్యం

ABN , First Publish Date - 2021-04-22T06:12:43+05:30 IST

పేదలకు మెరుగైన వైద్యమే లక్ష్యం

పేదలకు మెరుగైన వైద్యమే లక్ష్యం

గన్నవరం, ఏప్రిల్‌ 21 : పేదలకు మెరుగైన వైద్యం అందించటమే లక్ష్యమని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాల యంలో నియోజకవర్గంలోని 75మందికి మంజూరైన రూ.50,26,500 లక్షల చెక్కులను బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీ మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వైసీపీ నాయకులు అనగాని రవి, మేచినేనిబాబు, పడమట సురేష్‌, ఎన్‌విఆర్‌, పడమట రంగారావు, గుడిసే బాలస్వామి పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-22T06:12:43+05:30 IST