పేదల నడ్డి విరుస్తున్న ప్రభుత్వం!
ABN , First Publish Date - 2022-05-16T05:10:40+05:30 IST
వైసీపీ ప్రభుత్వం పేదల నడ్డి విరుస్తోందని టీడీపీ నాయకులు విమర్శించారు. రాజంపేట పట్టణం మన్నూరులో ఆదివారం బాదుడే బాదుడు కార్య క్రమాన్ని నిర్వహించారు.
రాజంపేట, మే 15 : వైసీపీ ప్రభుత్వం పేదల నడ్డి విరుస్తోందని టీడీపీ నాయకులు విమర్శించారు. రాజంపేట పట్టణం మన్నూరులో ఆదివారం బాదుడే బాదుడు కార్య క్రమాన్ని నిర్వహించారు. ఆ గ్రామానికి చెందిన మాజీ కౌన్సిలర్ ముమ్మడి చిన్నయ్య, బీసీ నాయకులు ఇడి మడకల కుమార్, సీనియర్ నాయకులు బండారు సుబ్బ రాయుడు తదితరులు ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, పెరిగిన నిత్యా వసర ధరల గురించి వివరించారు. పేద, మధ్య తరగతి ప్రజల నడ్డివిరిచే విధంగా జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈప్రభుత్వాన్ని గద్దెదించాల్సిన అవసరం అందరిపైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా నేత చెంగమ్మ, రాము యాదవ్, శ్రీను, నాగరాజు, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
పట్టణంలోని 4, 5, 11, 17 వార్డుల్లో వైసీపీ ప్రభుత్వం మూడేళ్ల కాలంలో పెంచిన నిత్యావసర ధరల గురించి వివరించారు. పెంచిన ధరల వల్ల పేద, మధ్య తరగతి ప్రజల బతుకు భారంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్చార్జి బీసీ రాయుడు, రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి చెన్నూరు సుధాకర్, పట్టణాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, సంజీవరావు, సుబ్రహ్మణ్యంనాయుడు, మందా శ్రీనివాసులు, మాజీ కౌన్సిలర్లు గుగ్గిళ్ల చంద్రమౌళి, మనుబోలువెంకటేశ్వర్లు, పబ్బిశెట్టి సుబ్రహ్మణ్యం, ముమ్మడి చిన్నయ్య, కౌన్సిలర్లు గోపి, మహిళా కార్యదర్శి ఉష, బీసీ నాయకులు ఇడిమడకల కుమార్ తదితరులు పాల్గొన్నారు.