గంగవరంలో జాతీయ పక్షి నెమలి ప్రత్యక్షం
ABN , First Publish Date - 2022-08-10T04:31:41+05:30 IST
మండలంలోని గంగవరం గ్రామ మజారా రామచంద్రాపురం కాలనీలో మంగళవారం జాతీయ పక్షి నెమలి ప్రత్యక్షమైంది.
కోవూరు, ఆగస్టు 9 : మండలంలోని గంగవరం గ్రామ మజారా రామచంద్రాపురం కాలనీలో మంగళవారం జాతీయ పక్షి నెమలి ప్రత్యక్షమైంది. గ్రామస్థుల సమాచారంతో సర్పంచ్ లక్ష్మీకుమారి సుభాష్ చంద్రబోస్ సేవా సంఘం ప్రతినిధి దేవిరెడ్డి సురేష్రెడ్డికి తెలిపారు. ఆయన ద్వారా సమాచారం అందుకున్న ఆత్మకూరు ఫారెస్టు రేంజ్ అధికారి పిచ్చిరెడ్డి సిబ్బందితో అక్కడకొచ్చారు. నెమలిని అడవుల్లో వదిలిపెడతామని చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తులు నెమలిని పెంచుకుంటుండగా కుక్కలు తరుముకోవడంతో కాలనీకి వచ్చినట్లుగా భావిస్తున్నారు.