డిగ్రీ పరీక్షలు రద్దు చేయాలని ధర్నా

ABN , First Publish Date - 2021-07-27T04:07:00+05:30 IST

డిగ్రీ పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ ఏబీవీపీ నేతలు, కార్యకర్తలు సోమవారం స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.

డిగ్రీ పరీక్షలు రద్దు చేయాలని ధర్నా
తహసీల్దారు కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న పీడీఎస్‌యూ నేతలు

సూళ్లూరుపేట, జూలై 26 : డిగ్రీ పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ ఏబీవీపీ నేతలు, కార్యకర్తలు సోమవారం స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. కరోనాలో తరగతులు నిర్వహించకుండానే డిగ్రీ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం సబబుకాదని నేతలు అన్నారు. అనంతరం తహసీల్దారు రవికుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ధర్నాలో నేతలు లోకేష్‌, రాజ, ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-07-27T04:07:00+05:30 IST