చాపరాయి అభివృద్ధికి ప్రణాళిక
ABN , First Publish Date - 2020-11-29T06:27:19+05:30 IST
పర్యాటక కేంద్రమైన చాపరాయి జలపాతం అభివృద్ధికి ప్రణాళిక రూపొందించామని పాడేరు ఆర్డీవో శివజ్యోతి అన్నారు.
పాడేరు ఆర్డీవో శివజ్యోతి
డుంబ్రిగుడ, నవంబర్ 28: పర్యాటక కేంద్రమైన చాపరాయి జలపాతం అభివృద్ధికి ప్రణాళిక రూపొందించామని పాడేరు ఆర్డీవో శివజ్యోతి అన్నారు. శనివారం చాపరాయి జలపాతాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చాపరాయి టెండరు ద్వారా వచ్చిన రూ.70 లక్షలతో పర్యాటకులకు అవసరమయ్యే సౌకర్యాలను కల్పించడానికి ప్రణాళిక రూపొందించామన్నారు. స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామపెద్దల సూచనలు, సలహాలతో చాపరాయి రూపురేఖలు మార్చబోతున్నట్టు చెప్పారు. మహిళా పర్యాటకులు దుస్తులు మార్చుకునేందుకు అవసరమైన స్నానపు గదులు, మరుగుదొడ్లు నిర్మాణానికి ప్రతేక దృష్టి పెట్టామన్నారు.