అత్యాచార నిందితుడిపై పీడీ యాక్టు
ABN , First Publish Date - 2020-10-15T07:22:10+05:30 IST
ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసిన నిందితుడిపై పీడీ యాక్టు నమోదు చేసి జైలుకు పంపినట్టు ఇన్స్పెక్టర్ శ్రీధర్కుమార్ బుధవారం
షాద్నగర్ రూరల్: ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసిన నిందితుడిపై పీడీ యాక్టు నమోదు చేసి జైలుకు పంపినట్టు ఇన్స్పెక్టర్ శ్రీధర్కుమార్ బుధవారం తెలిపారు. ఫరూఖ్నగర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన జవ్వాది శేఖర్(28) ఈ ఏడాది మార్చి, జులై నెలల్లో ఇద్దరు మహిళలపై అఘాయిత్యానికి పాల్పడినట్టు చెప్పారు. 2015లోనూ మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ట్లు తెలిపారు. సీపీ సజ్జనార్ ఆదేశాల మేరకు పీడీ యాక్టు నమోదు చేశామన్నారు. బాలికలపై, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడినా, ప్రేమ పేరుతో మోసం చేసినా పీడీ యాక్టు నమోదు చేస్తామని శ్రీధర్కుమార్ హెచ్చరించారు.