తరచూ నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్‌ : ఎస్పీ

ABN , First Publish Date - 2020-08-05T11:03:41+05:30 IST

తరచుగా నేరాలకు పా ల్పడే వారిపై పీడీ యాక్ట్‌ నమోదు చేయాలని ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ పో లీస్‌ అధికారులకు సూ చించారు

తరచూ నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్‌ : ఎస్పీ

గద్వాల క్రైం, ఆగస్టు 4 : తరచుగా నేరాలకు పా ల్పడే వారిపై పీడీ యాక్ట్‌ నమోదు చేయాలని ఎస్పీ  రంజన్‌ రతన్‌కుమార్‌ పో లీస్‌ అధికారులకు సూ చించారు. జిల్లా కేంద్రంలోని  పోలీస్‌ కార్యాలయం నుంచి మంగళవారం ఆయన పోలీస్‌ అధికారులతో వీడి యో కాన్పరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్బంగా ఎ స్పీ మాట్లాడుతూ జిల్లాలోని వివిధ స్టేషన్ల పరిధిలోని రౌడీషీటర్లు మళ్లీ క్రిమినల్‌ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో లేదో రోజువారి రిపోర్టును తయారు చేయాలన్నారు.


హత్య కేసుల్లో ఉన్న నిందితులు ఎలాంటి కార్యకలాపాలలో ఉంటున్నారో నిఘా ఉం చాలని ఆదేశించారు. ఇరువర్గాల మధ్య ఘర్షణలకు దిగేవారిని, తరుచుగా ఇసుక, గుట్కా, పీడీయస్‌ బియ్యం అక్రమ రవాణా చేసే వారిని గుర్తించి పీడీ యాక్ట్‌ నమోదుకు ప్రతిపాదనలు పంపాలన్నారు. ఏదైనా నేరం జరిగితే పారదర్శకంగా విచారణ చేపట్టాలని సూచించారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చే వారితో పోలీస్‌ సిబ్బంది సత్ప్రవర్తనతో మెలగాలని చెప్పారు. అదనపు ఎస్పీ కృష్ణ తదితరులు ఉన్నారు. 

Updated Date - 2020-08-05T11:03:41+05:30 IST