ఘరానా మోసగాడు ప్రసన్నకుమార్‌పై పీడీ యాక్ట్‌

ABN , First Publish Date - 2021-10-17T06:04:24+05:30 IST

సోషల్‌ మీడియాను దుర్వినియోగం చేస్తూ మహిళలను వేధించి వారిని మోసం చేసిన ప్రొద్దుటూరు గీతాశ్రమం వీధికి చెందిన ఘరానా మోసగాడు చెన్నపల్లి ప్రసన్నకుమార్‌ అలియాస్‌ ప్రశాంతరెడ్డి అలియాస్‌ రాజారెడ్డి అలియాస్‌ టోనీ (23)పై పీడీ యాక్ట్‌ నమోదు చేసినట్లు ఎస్పీ అన్బురాజన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఘరానా మోసగాడు ప్రసన్నకుమార్‌పై పీడీ యాక్ట్‌
చెన్నపల్లి ప్రసన్నకుమార్‌

రెండు తెలుగు రాష్ట్రాల్లో 26 కేసులు 

మహిళలపై వేధింపులు, చైన స్నాచింగ్‌, దొంగతనాలు కేసులలో ప్రధాన నిందితుడు

కడప(క్రైం), అక్టోబరు 16:  సోషల్‌ మీడియాను దుర్వినియోగం చేస్తూ మహిళలను వేధించి వారిని మోసం చేసిన ప్రొద్దుటూరు గీతాశ్రమం వీధికి చెందిన ఘరానా మోసగాడు చెన్నపల్లి ప్రసన్నకుమార్‌ అలియాస్‌ ప్రశాంతరెడ్డి అలియాస్‌ రాజారెడ్డి అలియాస్‌ టోనీ (23)పై పీడీ యాక్ట్‌ నమోదు చేసినట్లు ఎస్పీ అన్బురాజన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహిళలపై లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురి చేసి దాదాపు రెండు తెలుగు రాష్ట్రాలలో వందల మంది మహిళలు, యువతులను లోబరుచుకుని వారిని శారీరక, మానసిక వేధింపులకు గురిచేసిన ప్రసన్నకుమార్‌పై పీడీ యాక్ట్‌ నమోదుకు కలెక్టర్‌కు నివేదిక పంపడంతో కలెక్టర్‌ విజయరామరాజు అతడిపై పీడీ యాక్ట్‌ నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. 

Updated Date - 2021-10-17T06:04:24+05:30 IST