ముఖ్యమంత్రి వ్యాఖ్యలు హాస్యాస్పదం

ABN , First Publish Date - 2022-05-15T08:12:13+05:30 IST

ముఖ్యమంత్రి వ్యాఖ్యలు హాస్యాస్పదం

ముఖ్యమంత్రి వ్యాఖ్యలు హాస్యాస్పదం

వైసీపీ ప్రభుత్వానిది జేబుదొంగ పాత్ర

అందుకే గడప గడపలో గడబిడ: తులసిరెడ్డి


వేంపల్లె, మే 14: ‘మేనిఫెస్టో... భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌తో సమానం. మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలలో 95 శాతం ఇప్పటికే అమలు చేశాం’ అని సీఎం జగన్‌రెడ్డి చెప్పడం హాస్యాస్పదమని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి అన్నారు. శనివారం ఆయన ఒక ప్రకటన చేశారు. జగన్‌రెడ్డి ఇచ్చిన హామీలు, అమలు చేస్తున్నామంటున్న పథకాలు, క్షేత్ర స్థాయిలో వాటి అమలు తీరును వివరిస్తూ సునిశిత విమర్శ చేశారు. అదే సమయంలో మద్యం, ఇసుక, సిమెంటు, పెట్రోలు, డీజలు ధరలు, విద్యుత్‌, ఆర్టీసీ చార్జీలు పెంచి ప్రజల జేబుల్లో నుంచి ప్రభుత్వం రూ.3.40 లక్షల కోట్లు దోచుకున్నది, రూ.5 లక్షల కోట్లు అప్పు తెచ్చి ప్రజల నెత్తిమీద అప్పుల భారం మోపిందీ వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం జేబుదొంగ పాత్ర పోషిస్తోందని ప్రజలకు అర్థమైందన్నారు. అందుకే గడప గడపలో గడబిడ జరుగుతోందని తులసిరెడ్డి విమర్శించారు. 

Updated Date - 2022-05-15T08:12:13+05:30 IST