ప్రజల పక్షాన పనిచేయాలి: మస్తాన్‌వలి

ABN , First Publish Date - 2020-02-20T08:02:34+05:30 IST

ఇటీవల నూతనంగా పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన మాజీ ఎమ్మెల్యే షేక్‌ మస్తాన్‌వలి ఢిల్లీలో బుధవారం సాయంత్రం ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.

ప్రజల పక్షాన పనిచేయాలి: మస్తాన్‌వలి

గుంటూరు, ఫిబ్రవరి 19: ఇటీవల నూతనంగా పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన మాజీ ఎమ్మెల్యే షేక్‌ మస్తాన్‌వలి ఢిల్లీలో బుధవారం సాయంత్రం ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌, మాజీ సీఎం ఊమెన్‌చాందీ, పీసీసీ అధ్యక్షుడు శైలజానాధ్‌ ఇతర నేతలతో కలిసి ఆయన సోనియాను కలిసి మహాత్మాగాంధీ ప్రతిమను బహుకరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి తొలగ్గి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాయని, ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల పక్షానా కాంగ్రెస్‌ నిలవాలని ఆమె సూచించినట్లు తెలిపారు. 

Updated Date - 2020-02-20T08:02:34+05:30 IST