8న పీసీసీ మీటింగ్

ABN , First Publish Date - 2022-04-08T02:53:43+05:30 IST

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ ముఖ్య నాయకుల

8న పీసీసీ మీటింగ్

హైదరాబాద్: పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ ముఖ్య నాయకుల సమావేశం ఈ నెల 8న అనగా శుక్రవారం జరుగనుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా, యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మూడు దశల్లో కాంగ్రెస్ చేసిన ఉద్యమాలపై చర్చించనున్నారు. గురువారం  చేపట్టిన విద్యుత్ సౌద ముట్టడి అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు. రాహుల్ గాంధీ సభ భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తారు. టీపీసీసీ కార్యవర్గం, పీఏసీ సభ్యులు, అందుబాటులో ఉన్న ముఖ్య నాయకులకు ఆహ్వానం పంపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 


Updated Date - 2022-04-08T02:53:43+05:30 IST