పాకిస్తాన్ క్రికెటర్పై సస్పెన్షన్ వేటు.. పీసీబీ సంచలన నిర్ణయం..
ABN , First Publish Date - 2020-02-20T17:17:48+05:30 IST
పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఆటగాడు ఉమర్ అక్మల్పై సస్పెన్షన్ వేటు పడింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అవినీతి నిరోధక ...
న్యూఢిల్లీ: పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఆటగాడు ఉమర్ అక్మల్పై సస్పెన్షన్ వేటు పడింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అవినీతి నిరోధక నియమావళిలోని ఆర్టికల్ 4.7.1 కింద ఆయనను సస్పెండ్ చేస్తున్నట్టు పీసీబీ ఇవాళ ప్రకటించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించింది. దీంతో పీసీబీ అవినీతి నిరోధక విభాగం విచారణ ముగిసే వరకు అక్మల్ ఎలాంటి క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం లేదు.
‘‘ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నందున పీసీబీ దీనిపై ముందు ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయబోదు..’’ అని పీసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఓ ఫిట్నెస్ టెస్ట్ సందర్భంగా ఉమర్ అక్మల్ దురుసుగా ప్రవర్తించినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే అతడిపై సస్పెన్షన్ వేటు పడింది. లాహార్లోని నేషనల్ క్రికెట్ అకాడమీ వద్ద జరిగిన ఫిట్నెస్ టెస్టులో విఫలమైన అక్మల్... అక్కడి సిబ్బందితో అభ్యంతరకరంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు వచ్చాయి. గతేడాది ఆగస్టులో శ్రీలంకపై జరిగిన టీ20 మ్యాచ్లో పాకిస్తాన్ తరపున అక్మల్ చివరిసారి కనిపించాడు.