విద్యుత్ సంస్థలో ప్రక్షాళన అవసరం.. జగన్ సర్కార్పై పయ్యావుల ఆగ్రహం
ABN , First Publish Date - 2021-10-08T17:00:21+05:30 IST
అమరావతి: ఏపీలో విద్యుత్ సంస్థలో ప్రక్షాళన అవసరమని పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అన్నారు.
అమరావతి: ఏపీలో విద్యుత్ సంస్థలో ప్రక్షాళన అవసరమని పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులపై గత రెండు నెలలుగా అత్యధిక స్థాయిలో భారం పడుతోందంటూ ఆయన జగన్ సర్కార్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం పయ్యావుల మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం అసమర్థ తీరువల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఈ అదనపు భారాన్ని ప్రజలపై ఎలా వేస్తారని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఫైనాన్స్ డిపార్టుమెంట్లో జరిగిన అక్రమాలు, తప్పులను ఎత్తి చూపించామని దీంతో ఇవాళ ప్రభుత్వం ఢిల్లీ చుట్టూ తిరుగుతోందన్నారు. ఏ చట్టమైతే తప్పని చెప్పామో.. ఆ చట్టాన్ని అమలు చేయడానికి ఎలా ప్రయత్నాలు జరుగుతున్నాయో.. ఇవాళ విద్యుత్ రంగంలో కూడా అవే తప్పులు జరుగుతున్నాయని పయ్యావుల ఆరోపించారు. మరింత సమాచారం కొరకు ఈ వీడియో క్లిక్ చేయండి.