మంత్రి బుగ్గనకు పయ్యావుల కౌంటర్‌

ABN , First Publish Date - 2021-07-13T23:06:53+05:30 IST

మంత్రి బుగ్గన వ్యాఖ్యలకు టీడీపీ నేత పయ్యావులు కేశవ్ కౌంటరిచ్చారు. బుగ్గన సమాధానం సరిగా లేదని తప్పుబట్టారు.

మంత్రి బుగ్గనకు పయ్యావుల కౌంటర్‌

అమరావతి: మంత్రి బుగ్గన వ్యాఖ్యలకు టీడీపీ నేత పయ్యావులు కేశవ్ కౌంటరిచ్చారు. బుగ్గన సమాధానం సరిగా లేదని తప్పుబట్టారు. తాను ఏడు నిమిషాలు మాట్లాడిన అంశానికి.. ఆయన 55 నిమిషాలు మాట్లాడారని పేర్కొన్నారు. ఎక్కడా వివరణ ఇవ్వకుండా కేవలం రాజకీయ విమర్శలకు దిగారని ఆక్షేపించారు. మూడు రోజుల తర్వాత అధికారులు చెప్పినట్టు బుగ్గన చెప్పారని విమర్శించారు. గవర్నర్ బిశ్వభూషణ్‌కు తాము ఇచ్చిన లేఖపై బుగ్గన తేలికగా మాట్లాడారని పేర్కొన్నారు. సీఏజీ తప్పు చెప్పిందని, ఢిల్లీలో వాళ్లకు అర్థం కాలేదు అని మాట్లాడుతారా? అని పయ్యావులయ ప్రశ్నించారు. జూన్‌ 17-2020న ప్రిన్సిపాల్ సెక్రటరీ ఫైనాన్స్, సీఎస్‌ని లెక్కలు అడిగానని, సంవత్సరం తర్వాత జులై 1న తనకు ఒక లైన్ సమాధానం చెప్పారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 25 వేల కోట్లకు బ్యాంక్‌ గ్యారంటీ ఇచ్చినది లెక్కల్లో చూపలేదని తప్పుబట్టారు. 25 వేల కోట్లు అనేది పరిమితికి మించి చేసిన అప్పు అని పయ్యావుల కేశవ్‌ పేర్కొన్నారు.

Updated Date - 2021-07-13T23:06:53+05:30 IST