APERC చైర్మన్ను కలవనున్న PAC చైర్మన్ పయ్యావుల
ABN , First Publish Date - 2021-11-09T17:25:24+05:30 IST
ఏపీఈఆర్సీ చైర్మన్ను పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ కలవనున్నారు.
హైదరాబాద్: ఏపీఈఆర్సీ చైర్మన్ను పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ కలవనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్లోని సింగరేణి భవన్లో కలుస్తారు. ప్రధానంగా సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై మాట్లాడనున్నారు. సెకీ నుంచి యూనిట్ 2.49 రూపాయలకు కొనుగోలు అంశంపై పయ్యావుల మాట్లాడనున్నారు. విద్యుత్ ఖచ్చితంగా ఏ ధరకు వస్తుందో చెప్పాలని, ఏపీ ప్రభుత్వ వివరణ అసమగ్రంగా ఉందని, ఏపీఈఆర్సీ అనుమతిపైనా సర్కార్ స్పష్టత లేదని, ధీనిపై ఏపీఈఆర్సీ చైర్మన్ను కలిసి పయ్యావుల కేశవ్ ఫిర్యాదు చేయనున్నారు.