రీట్స్, ఇన్విట్స్ల్లో పెట్టుబడులకూ యూపీఐ ద్వారా చెల్లింపులు
ABN , First Publish Date - 2022-06-25T09:30:13+05:30 IST
రియల్ ఎస్టేట్ ఇన్వె్స్టమెంట్ ట్రస్ట్ (రీట్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వె్స్టమెంట్ ట్రస్ట్ (ఇన్విట్స్)ల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే చిన్న మదుపరులకు సెబీ మరో చెల్లింపు ఆప్షన్ను ప్రవేశపెట్టింది.
రూ.5 లక్షల వరకు అనుమతి: సెబీ
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ ఇన్వె్స్టమెంట్ ట్రస్ట్ (రీట్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వె్స్టమెంట్ ట్రస్ట్ (ఇన్విట్స్)ల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే చిన్న మదుపరులకు సెబీ మరో చెల్లింపు ఆప్షన్ను ప్రవేశపెట్టింది. రీట్స్, ఇన్విట్స్ పబ్లిక్ ఇష్యూల్లో రూ.5 లక్షల వరకు పెట్టుబడిని యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫే్స (యూపీఐ) ద్వారా చెల్లించే అవకాశం కల్పించింది. ఈ ఆగస్టు 1 నుంచి ప్రారంభమయ్యే ఇష్యూలకు ఇది అందుబాటులోకి రానుందని శుక్రవారం జారీ చేసిన సర్క్యులర్లో సెబీ స్పష్టం చేసింది. ప్రైవేట్ ప్లేస్మెంట్ ముగిసిన నాటి నుంచి అర్హులైన ఇన్వెస్టర్లకు యూనిట్ల కేటాయింపుతో పాటు వాటి లిస్టింగ్కు ఇన్విట్స్ గడువును ప్రస్తుతమున్న 30 రోజు ల నుంచి 6 రోజులకు కుదించింది. ఆగస్టు ఒకటి, ఆ తర్వాత ప్రారంభించే ఇన్విట్స్ ఇష్యూలకు ఇది వర్తిస్తుందని విడిగా జారీ చేసిన సర్క్యులర్లో వెల్లడించింది.