జీతాలిచ్చి పుణ్యం కట్టుకోండి

ABN , First Publish Date - 2022-05-21T07:07:12+05:30 IST

ప్రజల కోసం 24 గంటలూ నిద్రాహారాలు మాని విధులు నిర్వహిస్తున్న తమకు జీతాలు ఇచ్చి పుణ్యం కట్టుకోండి సారూ అంటూ 108 సిబ్బంది కోరుతున్నారు.

జీతాలిచ్చి పుణ్యం కట్టుకోండి
నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్న 108 సిబ్బంది

పూతలపట్టు, మే 20: ప్రజల కోసం 24 గంటలూ నిద్రాహారాలు మాని విధులు నిర్వహిస్తున్న తమకు జీతాలు ఇచ్చి పుణ్యం కట్టుకోండి సారూ అంటూ 108 సిబ్బంది కోరుతున్నారు. ఈ మేరకు పూతలపట్టులోని వీరు శుక్రవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంపీడీవో కార్యాల యంలో తాము బసచేసేవారమని, వాహనాన్ని కూడా కార్యాలయ ఆవరణలో ఉంచుకునే వారమని గుర్తుచేశారు. ప్రస్తుతం 108 వాహనాన్ని పార్కింగ్‌ చేసేందుకు ఎంపీడీవో కార్యాలయ అధికారులు అంగీకరించడం లేదన్నారు. దీంతో కిలోమీటరు దూరంలోని పోలీసుస్టేషన్‌ వద్ద పెట్టాల్సి వస్తోందన్నారు. దీనికితోడు మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని అన్నారు. ప్రభుత్వం స్పందించి జీతం మంజూరు 

Updated Date - 2022-05-21T07:07:12+05:30 IST