మోదీకి పవార్ మద్దతు ఇవ్వాలి: కేంద్రమంత్రి అథవాలె

ABN , First Publish Date - 2020-07-13T20:44:18+05:30 IST

శివసేనకు మద్దతివ్వాలని ఎన్సీపీ తీసుకున్న నిర్ణయం ఇరు పక్షాలకు మేలు చేసేది కాదు. కేంద్రం నుంచి మహారాష్ట్రకు ఎక్కువ నిధులు వస్తే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయవచ్చు. కేంద్రానికి మద్దతుగా ఉంటే కేంద్రం నుంచి

మోదీకి పవార్ మద్దతు ఇవ్వాలి: కేంద్రమంత్రి అథవాలె

ముంబై: ఎన్సీపీ అధినేత శరద్ పవార్, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయేలోకి రావాలని కేంద్రమంత్రి, ఆర్‌ఎల్‌పీ అధినేత రాందాస్ అథవాలె సూచించారు. పవార్ నిజంగా మహారాష్ట్ర అభివృద్ధి కోరుకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మద్దతు ఇవ్వాలని అన్నారు. బీజేపీ నుంచి శివసేనను దూరం చేసేందుకు తాను కొన్ని ప్రకటనలు చేశానని పవార్ ఒప్పుకున్న ఇంటర్వ్యూ వైరల్ అయిన అనంతరం అథవాలే ఈ వ్యాఖ్యలు చేశారు.


‘‘శివసేనకు మద్దతివ్వాలని ఎన్సీపీ తీసుకున్న నిర్ణయం ఇరు పక్షాలకు మేలు చేసేది కాదు. కేంద్రం నుంచి మహారాష్ట్రకు ఎక్కువ నిధులు వస్తే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయవచ్చు. కేంద్రానికి మద్దతుగా ఉంటే కేంద్రం నుంచి ఎక్కువ నిధులు సంపాదించవచ్చు. పవార్ కనుక దేశ అభివృద్ధి కోరుకుంటే మోదీకి మద్దతు ఇవ్వాలి, ఎన్డీయేలో చేరాలి’’ అని రాందాస్ అథవాలె అన్నారు.

Updated Date - 2020-07-13T20:44:18+05:30 IST